Book Description
”మీ ఆదర్శాలను మా సంస్థకు చెందిన బ్రాంచిలో మీరు అమలు జరపలేరని నేను పందెం కాస్తున్నాను.” ”అశోక్కి ఆత్మవిశ్వాసమూ, పోరాటమే కానీ అధైర్యం తెలియదు మేడమ్.” ”సరే. అయితే, ఆదర్శాలమీద నేనే జూదమాడబోతున్నాను. మనిద్దరం చెరో సంస్థా ప్రారంభించుదాం. ఎన్ని లక్షలైనాసరే, రెండూ సమానమైన పెట్టుబడితో ప్రారంభించాలి…” బిజినెస్ మాగ్నెట్గా ప్రసిద్ధిగాంచిన త్రినాధరావుగారి ఏకైక పుత్రిక భువనేశ్వరితో అతిసామాన్యుడైన అశోక్ పందెం కాశాడు. తన ఆదర్శాలకనుగుణంగా వ్యాపారం చేసి విజయం సాధిస్తానని ఛాలెంజ్ చేశాడు. గెలుపు తప్ప ఓటమి ఎరుగని భువనేశ్వరికీ, యాంగ్రీ యంగ్మేన్గా ప్రసిద్ధుడైన అశోక్కి మధ్య జరిగిన పోటీలో ఎవరు విజయాన్ని సాధిస్తారు? ఆ తర్వాతేం జరుగుతుంది? ఆంధ్ర పాఠకుల అభిమాన రచయిత్రి శ్రీమతి ఆరికెపూడి(కోడూరి) కౌసల్యాదేవి సృష్టించిన మరో నవలారత్నం – నివేదిత